వి ఎస్ ఆర్ చారిటబుల్ చైర్మన్ డాక్టర్ వడ్డి సత్యారావు జన్మదినోత్సవ వేడుకలు
అనకాపల్లి జిల్లా, చోడవరం గరుడ న్యూస్ (ప్రతినిధి): కోవెల. చంద్ర రావువి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వి. సత్యారావు మంగళవారం పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు వికలాంగులకు, నిరుపేదలకు, అన్నదానం,అలాగే ఆశ్రమలో, ఆర్ శివరాంపురంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు లు NRI హాస్పిటల్ డాక్టర్స్ చే కంటిపరీక్షలు ఈసీజీ, తగిన పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ కార్యక్రమం చేస్తారు. సేవ సామాజిక తోవ నాడిపట్టి వైద్యం చేయడమే కాదు ఆరోగ్యకర సమాజం కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు కొనసాగుతున్న ఆయన ఆర్ఎంపీ డాక్టర్ గా వైద్య సేవలు అందిస్తూ సమాజంలో పదిమందికి ఉపయోగపడే పనులు చేస్తున్నారు వి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటుతో అనాధలకు పేదలకు అండగా ఉంటూ పలువురి ఆదర్శంగా నిలుస్తున్నారు. పొట్టిదోరపాలెం గ్రామానికి చెందిన వడ్డి సత్యారావు ఆర్ఎంపి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ పనులు చేస్తూ పదవ తరగతి వరకు చదివించారు. పేదరికం వల్ల తినడానికి తిండి సరిగా ఉండేది కాదు. ఏడో తరగతి చదువుతూ హోటల్లో పనికి వెళ్లారాయన. పదో తరగతి పూర్తయ్యాక చదువు కొనసాగించేందుకు ఆర్థిక పరిస్థితూలు సహకరించకపోవడంతో విశాఖ డైయిరి కృషి హాస్పిటల్లో పనికి కుదిరారు. ఆపరేషన్ థియేటర్లో డాక్టర్కు సహాయకుడిగా చేరారు. అక్కడ ఐదేళ్లు పనిచేశాక బయటకు వచ్చేసి విశాఖపట్నంలో ఎముకలు వైద్య నిపుణులు కిరణకుమార్ వద్ద కొన్నాళ్లు పనిచేశారు. ఆయన వద్ద పనిచేస్తూనే ప్రైవేట్ గా డిగ్రీ బీకాం పూర్తి చేశారు. ఆ తర్వాత స్వగ్రామానికి వచ్చేసి ఆర్ఎంపీ డాక్టర్ గా ప్రాక్టీస్ ప్రారంభించారు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకు చిన్నచిన్న వైద్య సేవలు అందిస్తూ సామాజిక సేవకు ఆకర్షితులయ్యారు. తల్లిదండ్రులు ఆశీస్సులతో బాల్యంలో చదువుకునేందుకు పడిన కష్టాలు తిండి లేక పస్తులున్న ఉన్న రోజులు ఎదుటివారికి రాకూడదన్న లక్ష్యంతో తల్లిదండ్రులు ఆశీస్సులతో సేవా కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు పొట్టిదోరపాలెం రామాలయం వద్ద ప్రతి ఆదివారం అన్నదానం చేస్తున్నారు ఐదేళ్ల కిందట వి ఎస్ ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ట్రస్ట్ పేరుతో వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి తనతో నడిచే వారికి సభ్యులుగా చేరుస్తున్నారు ప్రస్తుతం ఈ గ్రూపులో వెయ్యిమంది సభ్యులుగా ఉన్నారు సభ్యులు కుటుంబాల్లో ఏ శుభకార్యమైన వృద్ధాశ్రమంలో అనాధాశ్రమంలో వెళ్లి అక్కడే వేడుకలు నిర్వహిస్తున్నారు . వారి సమక్షంలో కేక్ కోసి మిఠాయిలు పంచుకోవడంతోపాటు భోజనాలు సమకూరుస్తున్నారు. కిడ్నీ క్యాన్సర్ వర్షపాతంతో బాధపడుతున్న రోగులు తల్లిదండ్రులు లేని చిన్నారులకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ప్రేమ సమాజం వద్ద ఆనాదాశ్రమలు ప్రతివారం వెళ్లి ఉచితంగా వైద్య పరీక్షలు అందిస్తున్నారు గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి మందులు ఇస్తున్నారు రక్తదానంపై అవగాహన కల్పిస్తూ గుండెపోటు పై అవగాహన, పేదప్రజలకు ఉచితబస్ సౌకర్యం వైద్యసేవలు కల్పిస్తూ అపోహాలను తొలగించేందుకు కృషి చేస్తున్నారు. విజయవాడను బుడమేరు వరద చుట్టుముట్టడంతో వేలాదిమంది నిరాశలయ్యారు ఆర్ఎంపీ సంఘం పిలుపుమేరకు అక్కడకు వెళ్లి సేవా కార్యక్రమాలు నిర్వహించారు వి ఎస్ ఆర్ ట్రస్ట్ తరఫున 500 మంది వరద బాధితులకు నిత్యవసర సరుకులు దుప్పట్లు సమకూర్చారు. భీమునిపట్నం -నర్సీపట్నం బిఎన్ రోడ్డు లో కల్వటూర్ ల వద్ద గోతులను పుడ్పించి ప్రమాద సూచనలను ఏర్పాటు చేశారు.రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటిసమరక్షణకు చర్యలు చేపడుతున్నారు. సత్యారావు సేవలను గుర్తించి హైదరాబాదుకు చెందిన ఏసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ ఇటీవల డాక్టరేట్ ప్రధానం చేసింది. అలాగే ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ధ్రువపత్రం అందుకున్నారు విశాఖపట్నంలో మదర్ తెరిసా సేవా పురస్కారం అందుకున్నారు.