
గరుడ న్యూస్, సాలూరు
2004-2006 బ్యాచ్ లో భీమిలి జిల్లా విద్యా శిక్షణా సంస్థ (డైట్)లో విద్యను అభ్యసించిన విద్యార్థులు 50 మంది ఆత్మీయ కలయిక జరిగింది.ఆనాటి మధుర జ్ఞాపకాలు తలచుకొని,కొంత సమయం ఉపాధ్యాయులు విద్యార్థులుగా మారిపోయి ఆట పాటలతో సందడి చేశారు.ఆనాటి ప్రిన్సిపాల్ మీసాల సూర్యనారాయణ తో పాటు 10 మంది అధ్యాపకులకు సన్మానం చేశారు.ప్రస్తుతం కళాశాల ప్రధానోపాధ్యాయులు ఎల్.సుధాకర్ ఆద్వర్యం లో ఉల్లాసంగా, ఉత్సాహంగా కార్యక్రమం జరిగింది.
3489889112669932571.jpg)
