అందరి సహకారంతో ప్రశాంతంగా ముగిసిన శ్రీ శ్యామలాంబ అమ్మవారి  సిరిమానోత్సవ పండగ

Sivaprasad Patro
Sivaprasad Patro - Staff reporter
3 Min Read

పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు పట్టణం లో మే 20న  శ్రీ శ్యామలాంబ అమ్మవారి  సిరిమానోత్సవం ప్రారంభమయ్య, మే 21 తెల్లవారు జామున కన్నుల పండుగగా ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 900 మంది పోలీసులతో, జిల్లా పోలీసుశాఖ ప్రణాళికతో చేపట్టిన పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు, ముందస్తు భద్రత, జాగ్రత్త చర్యలు సత్ఫలితాలిచ్చాయి. సిరిమాను వెంబడి జిల్లా ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్   తిరిగి, ముగింపు వరకు బందోబస్తు ఏర్పాట్లును స్వయంగా పర్యవేక్షించారు. సిరిమానోత్సవం ముగిసిన తరువాత భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రధాన కూడళ్ళులో బ్యారికేడ్లును ఒక క్రమ పద్ధతిలో తొలగించి, వారు అన్ని మార్గాలలో వెళ్ళేందుకు అనుమతించారు. పోలీసుశాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీసు సేవాదళ్ దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణిలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండాకు విశేషమైన సేవలందించి, ప్రజల మన్ననలు పొందింది. సిరిమానోత్సవం అనంతరం సిబ్బంది విధుల నుండి వెళ్ళిపోకుండా పోలీసు అధికారులు చర్యలు చేపట్టి, తమకు కేటాయించిన స్థానం వద్దనేవుండి ట్రాఫిక్ రెగ్యులేషన్కు ప్రత్యేక చర్యలను పోలీసుశాఖ చేపట్టడం కూడా సత్ఫలితాలిచ్చింది.సిరిమానోత్సవం సజావుగా, ప్రశాంత వాతావరణంలో ముగియుటకు అన్ని వర్గాల ప్రజల తమ వంతు సహకారాన్ని పోలీసుశాఖకు అందించారని జిల్లా ఎస్పీ   అన్నారు. విద్యుత్, అటవీ, ఆరోగ్య, పారిశుద్యం,  పంచాయతి, ఫైర్, రెవెన్యూ, దేవాదాయ మరియు ఇతర శాఖలు సమన్వయంతో పని చేసాయన్నారు. అదే విధంగా ప్రజలు, పాత్రికేయులు, ఇతర జిల్లాల నుండి వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బంది తమ వంతు సహకారాన్ని  జిల్లా పోలీసుశాఖకు అందించారని, వారందరికి జిల్లా ఎస్పీ  ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్  ధన్యవాదాలు తెలిపారు. దొంగతనాలుకు ఆస్కారం లేకుండా జరగకుండా భక్తులను పోలీసుకంట్రోల్ రూం నుండి సిసి కెమెరాలను పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు సంబంధిత పోలీసు అధికారులను అప్రమత్తం చేయడం, మఫ్టీలో పోలీసులు(క్రైమ్ పార్టీ) పహారా కాయడం, అనుమానితుల వ్రేలి ముద్రలను ఎం.ఎస్.సి.డి., పరికరాలతో చెక్ చేసి, వారు పాత నేరస్థులా? కాదా? అన్న విషయం నిర్ధారణ కావడంతో దొంగతనాలు నిలవరించడం  జరిగింది అన్నారు. అన్ని ముఖ్య కూడళ్ళులో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను తాత్కాలిక ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేయడంతో సిసి ఫుటేజులను కమాండ్ కంట్రోల్ నుండే జిల్లా ఎస్పీ  పర్యవేక్షించారు. సిసి కెమెరాల ఫుటేజులు పరిశీలించి, రద్దీని బట్టి, మార్గాలను మళ్ళించడం జరిగింది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తోపులాటలకు ఆస్కారం లేకుండా భక్తులు అమ్మవారిని సురక్షితమైన, సులభమైన దర్శనం  చేసుకొనే విధంగా చేపట్టిన బందోబస్తు చర్యలు సఫలీకృతం అయ్యాయని, గుడి లోపల, క్యులైన్ల వద్ద, ప్రసాదం కౌంటర్ల వద్ద ,ముఖ్యకూడల్లవద్ద ఏర్పాటు చేసి సిసి కెమరాలును పరిశీలిస్తూ ఆయా ప్రాంతాలలో విధులు నిర్వహించే పోలీసు అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడగలిగామని, పోలీసుశాఖకు సహకరించిన యావన్మంది ప్రజానీకానికి, ఇతర జిల్లాల నుండి బందోబస్తు విధులు నిర్వహించడానికి జిల్లాకి విచ్చేసిన పోలీస్ అధికారులకు,సిబ్బందికి, ఇతర శాఖల వారికీ, పాత్రికేయులకి అందరికి జిల్లా ఎస్పీ  ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ గారు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు  తెలిపారు. అదేవిధంగా శ్యామలాంబ అమ్మవారి సిరిమానోత్సవం సజావుగా 1974 సంవత్సరం తరువాత ఈ సంవత్సరమే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జారకుండా ప్రధాన ఆలయాన్ని చేరుకోవడంతో యావన్మంది ప్రజానీకం హర్షాన్ని వ్యక్తం చేస్తూ, ఈ ఘనతకు కారకులైన జిల్లా ఎస్పీ  ప్రశంసించారు. ప్రణాళికతో పటిష్ట బందోబస్త్ నడుమ ఈ కీర్తి సాధించినందుకు జిల్లా పోలీస్ యంత్రాంగానికి, ఇతర జిల్లాల పోలీస్ అధికారులకు,సిబ్బందికి జిల్లా ఎస్పీ  కృతజ్ఞతలు తెలియజేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *