
గరుడ న్యూస్,సాలూరు
అంగట్లో అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని ఉంది అన్నట్టుగా సాలూరు విద్యుత్ శాఖ వారి తీరు ఉంది ఇంత పెద్ద పండుగ జరుగుతున్నప్పుడు విద్యుత్ శాఖ వారు ముందు చూపుతో ఉంటే ఇలా ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదు. వేరే దూర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు అతిథులు ఇబ్బంది పడేవారు కాదు. పండుగ ఎంత బాగా జరిగినా, కరెంట్,శానిటేషన్ సరిగ్గా లేకుంటే ఇత్యాది కారణాలతో సాలూరు ప్రాంతం గురించి నెగటివ్ ముద్ర పడుతుంది. పండగ చేసేదే పదేళ్లకు ఒక్కసారి అటువంటి ఉత్సవం జరిపేటప్పుడు ప్రతి శాఖ వారు ముందుచూపుతో ఉంటే ఇలాంటి కరెంటు కష్టాలు రావు….
సాలూరు పట్టణం లో 2 రోజులుగా పవర్ కట్…ప్రజల ఆక్రోశం తారాస్థాయి కి చేరిన వైనం. ప్రజల సహనం కోల్పోయి ఎలక్ట్రికల్ ఏ.డీ. ఈ రంగారావు ను నాయుడు వీధి రామ మందిరం లో నిర్బంధించి తమ నిరసన ప్రకటించారు. అక్యాన వీధి, అల్లు వీధి, దుగ్గాన వీధి,బార్కసు వీధి,గొల్లవీధి తదితర ప్రాంతాల ప్రజలు,అతిథులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ప్రజల ఆగ్రహం తో ధర్నాలు చేపట్టి,కొవ్వొత్తులతో నిరసన తెలిపారు.పోలీసులు రంగం లోకి దిగి స్థానికులతో చర్చలు జరిపారు.

