
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాప్ రిపోర్టర్,సంస్థాన్ నారాయణపురం,చిల్లాపురం,మే 22,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని చిల్లాపురం పురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకల రమేష్,చంద్రయ్య,వెంకటయ్య, లక్ష్మణ్,సోదరుల తల్లి గారు మేకల రాములమ్మ ఇటీవల మరణించారు.ఈ నేపథ్యంలో వారి దశ దిన కార్యక్రమానికి హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు కుక్కల నరసింహ్మ. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కరెంటోత్ శ్రీను నాయక్,జక్కలి ఐలయ్య యాదవ్,బిక్షపతి నాయక్,బంధుమిత్రులు,తదితరులు పాల్గొన్నారు.
