గరుడ న్యూస్,సాలూరు
సాలూరు పట్టణం మజ్జులపేట ప్రజలు,బాల్ చిన్న పిల్లలతో సహా గత మూడు రోజులుగా కరెంటు కోత,నీరు సమస్య గూర్చిప్రభుత్వం పై,సంబంధిత అధికారులు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేశారు.బందువులు తిట్టుకుంటూ,ఇంకా ఎప్పుడూ పండుగ కు రాకూడదని తిట్టుకుంటూ వెళ్లారని,వాపోయారు.చాలా ఇబ్బందులు పడ్డామని అన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వరకు వారి వార్డు ప్రజలకు కరెంట్ ఎందుకు ఇవ్వలేదని ఆ వార్డు కౌన్సిలర్ వైసీపీ నుండి జనసేన లోకి మారిన రాపాక మాధవ రావు (జనసేన) అధికారులను ప్రశ్నిస్తూ మాట్లాడారు.త్వరలో విద్యుత్ సమస్య పరిష్కరిస్తామని విద్యుత్ అధికారులు తెలిపారు.ఇంత దానికి 20 రోజుల పాటు కరంట్ కోతలు పండుగ నాలుగు రోజులకోసం బరిస్తే 20 రోజులు ట్రైలర్ చూపించి,నాలుగు రోజులు సినిమా చూపించిన చందంగా చేసినట్టు ప్రజలు అంటున్నారు.




