
గరుడ ప్రతినిధి పుంగనూరు





పుంగనూరు నియోజకవర్గ తెదేపా ఇంచార్జి చల్లా బాబు మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు.మినీ మహానాడుకు విచ్చేసిన నియోజకవర్గంలోని నాయకులను, కార్యకర్తలను, ప్రజలను పేరుపేరునా ఆప్యాయంగా పలకరించిన చల్లా బాబు రెడ్డి పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు అనంతరం చల్లా బాబు గారు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేశారు.తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పండుగ మహానాడు కార్యక్రమాన్ని మనకు అతి దగ్గరగా కడప నందు నిర్వహిస్తున్నారని కావున ప్రతి ఒక్క కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.పుంగనూరు నియోజకవర్గాన్ని మదనపల్లె రెవెన్యూలో కలిపినందుకు ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.అతి తొందరలోనే మదనపల్లె ను జిల్లాగా చేయాలని ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కోరుతానని తెలియజేశారు.నియోజకవర్గంలో కొంతమంది కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని ఎవరూ కూడా అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదని కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్త ని తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని ఎవరూ కూడా అధైర్య చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.అదేవిధంగా రాష్ట్రంలోనే పుంగనూరు నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అత్యధిక కేసులు ఉన్నాయని ఇప్పటికే మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తో కలిసి డీజీపీ గారిని కలిసి తెలియజేశానని ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా పుంగనూరు కార్యకర్తల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.