గోదావరి జిల్లా, కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): తణుకు. వరప్రసాద్: బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారి అధ్యక్షతన ఆయన స్వగృహం వద్ద నిర్వహించిన సమన్వయ సమావేశం నందు ముఖ్య అతిథులుగా అమలాపురం పార్లమెంటరీ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి గారు పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, PAC సభ్యులు పినిపే విశ్వరూప్ ,తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయిల్, జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, నియోజకవర్గ కోఆర్డినేటర్లు పొన్నాడ సతీష్ కుమార్, గొల్లపల్లి సూర్యారావు, పినిపే శ్రీకాంత్, పిల్లి సూర్య ప్రకాష్, గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి పాల్గొన్నారు.