
గరుడ ప్రతి నిధి
చౌడేపల్లి మే 25
మండల కేంద్రమైన చౌడేపల్లి లో ఆదివారం నిర్వహించిన ఆయుర్వేద ఆరోగ్య వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద గల సచివాలయంలో సత్సంగ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు చౌడేపల్లి సర్పంచ్ శ్రీ రామ్ భరత్ వరుణ్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు పలువురికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూత్రాలను తెలిపారు సత్సంగ్ ఫౌండేషన్ వైద్య నిపుణులు సుజాత రామచంద్రన్ నిఖిల ఫౌండేషన్ మేనేజర్ నగేష్ స్థానికులు పాల్గొన్నారు
