
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,మే25,(గరుడ న్యూస్):
తెలంగాణ రాష్ట్ర తుర్క కాశ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గాంధీ భవన్ లో తుర్క కాశ కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే బడేసాబ్ టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి వినతి పత్రం అందజేశారు.అనంతరం మహేష్ కుమార్ గౌడ్ తో బడేసాబ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి తుర్క కాశ కార్మికుల కీలక పాత్ర పోషించిందనీ ప్రజా పాలనలోనైన మా కార్మికుల సమస్యల్ని ప్రభుత్వం గుర్తించి తగిన న్యాయం చేయాలని ఆయన కోరారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అతి పేదరికంలో మగ్గుతున్న కార్మికులు ఎవరైనా ఉన్నారు అంటే అది తుర్క కాశ కార్మికులే అని అన్నారు.మండే ఎండలో బ్రతకలేక బండలు కొట్టుకుంటూ ప్రమాదాలకు గురవుతూ జీవనం కొనసాగిస్తు కుటుంబాన్ని పోషిస్తున్నారనీ, మా బ్రతుకులు మారాలంటే మాకు ప్రత్యేక తుర్క కాశ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా కార్మికులు అభివృద్ధికి కృషి చేయాలి అని విజ్ఞప్తి చేశారు.అదే విధంగా రాబోయే రోజుల్లో శాసన మండలి సమావేశాలలో తుర్క కాశ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి మా కార్మికుల పక్షాన నిలబడి మీ గొంతు బలంగా వినిపించాలి అని మహేష్ కుమార్ గౌడ్ కి విజ్ఞప్తి చేశారు.అనంతరం టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో తుర్క కాశ కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని బడేసాబ్ కి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ జానీ,సయ్యద్ ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.
