సంస్థాన్ నారాయణపురం మండల కాంగ్రెస్ కమిటీకి నామినేషన్ వేసిన . . . . మహమ్మద్ అక్బర్ అలీ,ఏపూరి సతీష్

Singham Krishna
2 Min Read

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,మే27,(గరుడ న్యూస్):

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ  ఆదేశాలమేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్,సూచనల మేరకు కాంగ్రెస్ సంస్థ గత నిర్మాణానికి మండల అధ్యక్షుల ను ఎన్నుకోవడానికి చౌటుప్పల్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టీపీసీసీ ఇంచార్చ్ లు డాక్టర్ పులి అనిల్,జిల్లా అధ్యక్షులు అందేం సంజీవ రెడ్డి,కలిసి నామినేషన్ పత్రాలను స్వీకరించారు.సంస్థాన్ నారాయణపురం మండల అధ్యక్ష స్థానానికి సీనియర్ నాయకులు మహమ్మద్ అక్బర్ అలీ,మాజీ అధ్యక్షులు ఏపూరి సతీష్ వేరువేరుగా నామినేషన్ వేశారు.ప్రజా సమస్యలపై గత బారసా,బీజేపీ పాలనలో ప్రజల పక్షాన  నిరంతరం పోరాటం చేశామని,తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి నిరంతరం అహర్నిశలు కృషి చేశామని తెలియజేశారు.కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నామని,పార్టీకి కష్టకాలంలో వెన్నుదాన్నుగా నిలిచి కార్యకర్తలను కాపాడుకొన్నామని అన్నారు.రేవంత్ రెడ్డి నాయకత్వంలో  ఏఐసీసీ,టీపీసీసీ ఆదేశాలను అమలు చేస్తూనే స్థానిక సమస్యలపై ఉద్యమాలు చేశామని అన్నారు.ముఖ్యంగా ఎమ్మెల్యే,ఎంపీ ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,గెలుపుకు చామల కిరణ్ కుమార్ రెడ్డి,గెలుపుకు అహార్నిశలు  పనిచేశామని గత 20 యేండ్లుగా   బూత్ స్థాయి నుండి కార్యకర్తలుగా పనిచేసి సర్పంచ్,ఎంపీటీసీ,జడ్పీటీసీ,సొసైటీ ఎన్నికల పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థుల గెలుపుకు కృషి చేశామని అన్నారు.పార్టీ ఇచ్చిన అవకాశాలను  అందిపుచుకుని పార్టీలో నాయకత్వన్ని ఐక్యపరచి పార్టీని ముందుకు తీసుకుపోతున్నామని అన్నారు.మళ్ళీ అవకాశం ఇస్తే ప్రభుత్వ పథకాలను   ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజలకు అందేవిదంగా పనిచేస్తామని అన్నారు.పార్టీని నమ్ముకుని పనిచేసిన నాయకులకు అవకాశం కల్పిస్తామని టీపీసీసీ ఇంచార్జ్ లు తెలుపదం సంతోషం వ్యక్తం చేసారు.మండల కమిటీ ఎన్నిక  ఎవ్వరి సిపర్సులు ఉండవని,పార్టీకి  చేసిన పనితిరు పరిగణలోకి తీసుకుంటారని అన్నారు.మొదట ఏకగ్రీవం చేయుటకు అవకాశం కోరగా పోటీలో పలువురు సిద్ధం కావడం చర్చనీయం అయింది.పోటీలో వచ్చిన నామినేషన్ లను టీపీసీసీ కి సమర్పించుతామని  కొద్దీ రోజులోనే నూతన అధ్యక్షులను ప్రకటిస్తామని అన్నారు.టీపీసీసీ నిర్ణయమే తుది నిర్ణయం అని ఎవరైనా  పార్టీకి వ్యతిరేకంగా బహిరంగంగా చర్చ చేయరాధన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు, పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *