
గరుడ న్యూస్,సాలూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు” యోగాంధ్ర”కార్యక్రమంలో భాగంగా సాలూరు పురపాలక సంఘం నందు కమిషనర్ డీ.టీ.వి.కృష్ణారావు ఆధ్వర్యంలో సాలూరు ప్రజలకు యోగ పై అవగాహన కల్పించుటకు స్థానిక బోసు బొమ్మ సెంటర్లో, యోగ సెంటర్ సాలూరు వారిచే, మహిళా మండలి సభ్యులతో యోగాసనాలు, యోగా వలన కలిగే లాభాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివకుమార్ , శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ , యోగా సంఘం ప్రతినిధులు, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.

