
గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు మున్సిపాలిటి సర్వసభ్య సమావేశం ఈనెల 29న ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు చైర్మన్ అలీమ్బాషా తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సాధారణ సమావేశంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రస్తుతం కరోనా వ్యాపిస్తుండటంతో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టే విషయమై చర్చించనున్నట్లు తెలిపారు. సర్వసభ్య సమావేశానికి సభ్యులు, అధికారులు తప్పక హాజరుకావాలెనని కోరారు.