
గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు పట్టణంలోని శ్రీశనేశ్వరస్వామి ఆలయాలలో మంగళవారం జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేసి అలంకరించారు. పట్టణ సమీపంలోని యాబైరాళ్ల వెహోరవ వద్ద వెలసిన శ్రీశనేశ్వరస్వామి ఆలయం, అలాగే రాగానిపల్లె రోడ్డులో వెలసిన శ్రీశనేశ్వరస్వామి, దండుపాళెంలోని శ్రీశ్రీశనేశ్వరస్వామి ఆలయంలోను ప్రత్యేక తైలాభిషేకము, నువ్వులు, నూనేతో, అమృతాభిషేకాలు, నువ్వుల దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.