దళిత ముస్లిం యువకులను కొట్టిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలి

G Venkatesh
1 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు

తెనాలి ఐతా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొద్ది రోజుల క్రితం దళిత ముస్లిం యువకులను దారుణంగా రోడ్లపైనే కొట్టిన 2 టౌన్ సీఐ రాములు నాయక్.3 టౌన్ సీఐ సురేష్ బాబు లను వెంటనే సస్పెండ్ చేసి విధుల నుండి తొలగించి వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలని లేకుంటే మాల మహానాడు ఆధ్వర్యంలో తెనాలి పోలీస్ స్టేషన్ ను ముట్టడిస్తామని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి అశోక్ అంబేద్కర్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేసారు.రాష్ట్రములో అంబేద్కర్ రాజ్యాంగం అమలు చెయ్యడము లేదు.పోలీస్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు .హోం మంత్రి అనిత వెంటనే వీరి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కార్యక్రమములో నాయకులు శ్రీనివాసులు.గంగా.నాగ.ఆనంద.భాస్కర్.అజయ్.మంజు.వంశీ.పవన్.తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *