
గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు మండలం MSP ఇంచార్జ్ మాతంగి నాగభూషణం MSP కో ఇంచార్జ్ వరగాని ప్రభాకర్ అధ్యక్షతన పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో MSP పుంగనూరు నియోజకవర్గం ఇన్చార్జిబి నరసింహులు మాట్లాడుతూ మాదిగ, మాదిగల ఉపకులాల ఉజ్వల భవిష్యత్ కై 30 సంవత్సరాల నిరంతరo అలుపెరుగనిపోరాటం చేసి.మాదిగల ఉనికిని, అస్థిత్వాన్ని ఆత్మగౌరవాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చిన మాదిగల ఆరాధ్య దైవం.. మహాజన నేత మందకృష్ణ మాదిగ ఈ నెల 27 న భారతదేశ అత్యున్నత పౌరపురస్కారం స్వీకరించి ఈ నెల 31న వరంగల్ కేంద్రానికి అడిగిడుతున్న సందర్బంగాపుంగనూరు నియోజకవర్గం లోని 6 మండలాలు పుంగనూరు చౌడేపల్లి సోమల సదుం పులిచర్ల రోంపిచర్ల లోని MRPS, MSP మరియు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, సామాజిక వాదులు లక్షలాది మంది వరంగల్ కి చేరుకొని మహాజన నేత మందకృష్ణ మాదిగ కి ఘనస్వాగతం పలకాలని విజ్ఞప్తి చేస్తున్నా. అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పుంగనూరు మండలం MSP ప్రధాన కార్యదర్శి (చిట్టి), వెంకటరమణ చదళ్ళ ,అండి గాని పల్లె సుబ్రమణ్యం ,మురళి, ప్రసాద్ ,గెంగిరెడ్డి ,రఘు ,గోవార్ధణ మొదలగు వారు పాల్గొన్నారు