గరుడ ప్రతినిధి పుంగనూరు
చౌడేపల్లి మండలం లో పందిళ్ళపల్లి పంచాయతీ ముదిరెడ్డిపల్లి తొప్పిరెడ్డిపల్లి చుక్కావారి పల్లె సమీపంలోని పంట పొలాలపై బుధవారం రాత్రి ఏనుగుల గుంపులు దాడులు చేశాయి. పంటలను ధ్వంసం చేసి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. వరి మామిడి తోటలను తొక్కి కొమ్మలను విరిచి నాశనం చేయడంతో పాటు బోర్ల పైపులు వివిధ పరికరాలను ధ్వంసం చేసి కూరగాయ పంటలను తినేసాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొని ఆర్థికంగా చేయూతనివ్వాలని బాధితులు కోరుతున్నారు.