
తిరుపతి జిల్లా, పాకాల మండలం మొగరాల గ్రామం గరుడ న్యూస్ (ప్రతినిధి): నీవినీ ఎరుగని రీతిలో మొగరాల మహాభారతం .. ఎటువంటి కాలయాపన లేకుండా అమ్మవారిపై భక్తి శ్రద్ధలతో కథలో నిమగ్నమై తన కంఠంతో మహాభారతాన్ని వివరిస్తూ ఉంటే స్థానిక భక్తాదులందరూ మహాభారతం జరుగుతున్న పుణ్యస్థలం లోకి చేరుకొని మహాభారతం మహాకావ్యాన్ని వింటూ ఆనందోత్సాహాలతో ఆహ్లాదంగా మునుపెన్నడు లేని విధంగా మహాభారతం జరుగుతున్నదని హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2025వ సంవత్సరం మహా భారతాన్ని మహా అద్భుతంగా నిర్వహిస్తున్నారని ఆలయ నిర్వహకులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు స్థానికులు. మహాభారతం అంటే ఇలా ఉండాలి అనే విధంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఎక్కడెక్కడినుండో దూర తీర ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి మహాభారతాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షిస్తున్నారు. మహాభారతం మొదటి రోజు శ్రీ వేదవ్యాస మహర్షి జననం.. హరికథా కాలక్షేపం ద్వారా భక్తులకు శ్రీమతి ఉషారాణి భాగవతరణి వేదవ్యాస మహర్షి జననం గూర్చి వివరించిన తీరు పలువురిని ఆకట్టుకున్నది. భక్తులు భక్తిశ్రద్ధలతో హరికథా కాలక్షేపాన్ని విని తరించారు.

హరికథా కాలక్షేపం చేస్తున్న శ్రీమతి ఉషారాణి భాగవతరణి..
