
గరుడ న్యూస్,సాలూరు
జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా బిజెపి నేత జలుమూరు మణికుమార్ ను నియమిస్తూ జిల్లా కలెక్టర్, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ ఏ. శ్యామ్ ప్రసాద్ నుండి ఆదేశాలు వచ్చినట్టు మీడియాకు తెలిపారు. జిల్లా మానిటరింగ్ కమిటీ చైర్మన్ గా జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ ఉన్నారు. కమిటీలో సభ్యులుగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా ఎస్పీ తో పాటు కొందరు గెజిటెడ్ అధికారులు ఉన్నట్టు సమాచారం. జలుమూరి మణికుమార్ కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

