అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

Sesha Ratnam
1 Min Read

తిరుపతి జిల్లా, తిరుచానూరు గరుడ న్యూస్ (ప్రతినిధి): హరికృష్ణ: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి కృష్ణ మోహన్ కుటుంబ సమేతంగా మరియు సినీ హీరోయిన్ శ్రియ కుటుంబం సమేతంగా వేరువేరుగా అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు అర్చకులు ప్రత్యేక దర్శనం కల్పించి అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం అదేవిధంగా హైదరాబాదుకు చెందిన ఎం రామకృష్ణారావు అనే భక్తుడు గురువారం ఉదయం పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రసాదం పోటులో వినియోగించేందుకు 20 లీటర్ల కెపాసిటీ గల  టీలింగ్ గ్రైండర్లును విరాళంగా ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాదుకు అందజేశారు. అనంతరం విరాళం అందించిన భక్తుడకు దర్శనం ఏర్పాట్లు కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్ భక్తుడు అందించిన గ్రైండర్లను అమ్మవారి ఆలయంలో ప్రసాదం పోటులో ఈ గైండర్లను వినియోగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్ ఆలయ సూపర్డెంట్ రమేష్ ప్రసాదం ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు ఆలయ అర్చకులు బాబు స్వామి తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *