
గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరులోని రేషన్ దుకాణాలను తహసీల్దార్ రాము ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిటి. శ్యామ్ ప్రసాద్ రెడ్డితో కలసి శుక్రవారం పిచ్చి గుండ్లపల్లి లోని రేషన్ దుకాణాన్ని పరిశీలించారు. జూన్ 1 నుంచి దుకాణాల్లోనే రేషన్ సరుకులు సరఫరా ఉంటుందని చెప్పారు. ఎప్పటికప్పుడు సంబంధిత రికార్డులను నమోదు చేయాలని ఆదేశించారు. పుంగనూరు పరిధిలో 50 రేషన్ దుకాణాలను తనిఖీ చేసి తగు సూచనలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.