జూన్‌4న జరిగే వెన్నుపోటు దినంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి – మాజీ ఎంపీ రెడ్డెప్ప

G Venkatesh
1 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు

వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు జూన్‌4న జరిగే వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప కోరారు. ఆదివారం స్థానిక రాజన్న బస్టాండ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి రెడ్డెప్ప, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ కన్వీనర్‌ ఫకృద్ధిన్‌షరీఫ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, ఎంపీ భాస్కర్‌రెడ్డి , వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం, రాష్ట్ర యువత సంయుక్త కార్యదర్శి చెంగారెడ్డి లు కలసి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెన్నుపోటు దినం పోస్టర్లను విడుదల చేశారు. రెడ్డెప్ప మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డిల ఆధ్వర్యంలో పట్టణంలో 4న వెన్నుపోటుదినం నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్న హామీలు నేరవేర్చకపోవడంపై వెన్నుపోటు దినం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ అభిమానులు, పెద్దిరెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల, పట్టణ అధ్యక్షులు అమరనాథరెడ్డి, ఇర్ఫాన్‌, జిల్లా అధికార ప్రతినిది రాజశేఖర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, నాయకులు ఆవుల అమరేంద్ర, రాజేష్‌, ఖాదర్‌, జయరామిరెడ్డి, అమ్ముకుట్టి, నూర్‌, కౌన్సిలర్లు అమ్ము, భారతి, రేష్మా, సాజిదా, జెపి.యాదవ్‌, సురేష్‌, భూషణ, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *