
గరుడ ప్రతినిధి పుంగనూరు

చౌడేపల్లి మండల విద్యాశాఖ కార్యాలయం నందు మంగళవారం మండలంలోని అన్ని పాఠశాలల వంట యాజమాన్యం వారికి సమావేశమును నిర్వహించడం జరిగింది.ఈ సమావేశం మండల విద్యాశాఖ అధికారిణి ఆర్సి తిరుమలమ్మ అధ్యక్షత నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో వంట యాజమాన్యం వారికి వంటను వండునప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది.ఈ సమావేశంలో మండలంలోని అన్ని పాఠశాలలకు సంబందించిన వంట యాజమాన్యం వారు మరియు మండల విద్యాశాఖ సిబ్బంది సిఆర్పిలు ఏ.సుబ్రహ్మణ్యం టి.రంజిత్ కుమార్ బి.రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.