గరుడ ప్రతినిధి పుంగనూరు


ప్రముఖ పుణ్యక్షేత్రం,భక్తుల కోర్కెలు తీర్చే కల్పవళ్ళి బోయకొండ గంగమ్మ దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఇటు ఆంద్రదేశ్ అటు కర్ణాటక,తమిళనాడు నుండి భక్తులు అధికంగా వచ్చారు,భక్తులు ఉదయం నుండి క్యూలైన్లలో అమ్మవారి మొక్కులు తీర్చుకోవడానికి బారులు తీరారు. ప్రధాన అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వాహణాధికారి మరియు ఉపకమీషనర్ ఏకాంబరం ఏర్పాట్లను పరిశీలించారు.అనంతరం ఉచిత ప్రసాదాల వద్ద, అమ్మ వారి పవిత్ర తీర్థము గత వారం నుండి మూలస్థానమ్మ వద్ద ఏర్పాటు చేయడం తో అధిక సంఖ్యలో తీర్థం
బాటిళ్ళుఅమ్ముడు పోతున్నాయని, సిబ్బంది తెలియజేశారు. అక్కడ తోపులాటలు లేకుండా అందరూ క్యూలైన్లో వెళ్ళి ప్రసాదాలు తీసుకొనే విధముగా సిబ్బందిని ఆదేశించారు, అమ్మవారి బలిపీఠము వద్ద జంతుబలులను,అక్కడ గల సౌకర్యాలను,అలాగే తలల వేలం పాటవద్ద గల భక్తులతో చర్చించి,వేలం పాట సవ్యంగా జరుగుతున్నదా లేదా అనేవిషయాలపై,సిబ్బంది భక్తులతో మాట్లాడుతున్న తీరుపై భక్తులను అడిగి తెలుసుకున్నారు,కళ్యాణ కట్ట వద్ద భక్తులకు తలనీలాలు సమర్పించే భక్తులు టికెట్టు ద్వారానే తలనీలాలు సమర్పించాలనీ,ఎవరికీ అధనంగా పైకము చెల్లించవద్దని భక్తులకు తెలియజేశారు,కళ్యాణ కట్ట లో ఎవరైనాసిబ్బంది చేతివాటం ప్రదర్శినట్లు కార్యాలయం దృష్టికి వస్తే ఖచ్చితమైన చర్యలు ఉంటాయని కళ్యాణ కట్ట సిబ్బందిని హెచ్చరించడం జరిగింది,అంతే కాకుండా అనునిత్యం సమాచార కేంద్రం నుండి ఆలయ ప్రాంగణం లో జేబుదొంగలున్నారని,తమ విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలని భక్తులకు హెచ్చరికలు చేశారు,ఎవరికైనా ఏదైనా అసౌకర్యం కలిగినా,ఎవరైనా పిల్లలు తప్పిపోయినా పరిపాలనా కార్యాలయం ఎదురుగా గల సమాచార కేంద్రం లో సంప్రదించాలని సూచించడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఆయన వెంట సూపరింటెండెంట్ రామనాథం,సుధాకర్ రెడ్డి,మణి తదితరులు ఉన్నారు.