యోగాంద్ర ను విజయవంతం చేద్దాం -ఆర్డిఓ భవాణి పిలుపు

G Venkatesh
1 Min Read

చౌడేపల్లి జూన్ 3 సూర్య న్యూస్:

అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని’ యావత్‌ ప్రపంచం నేడు సమధికోత్సాహంతో వూరూరా ఉత్సవంలా జరుపుకొంటోందని,ఇది సంపూర్ణ ఆరోగ్యానికి నిజమైన స్ఫూర్తి అవుతుందని,పరిపూర్ణ మానవుడి ఆవిష్కారానికి నిజమైన మార్గమని,ఇది మహ రాజ మార్గం. మన మహద్భాగ్య యోగ  సాధన పురాతనమైనదే అయినా.. దీని అవసరం ఈ ఆధునిక కాలంలోనే ఎక్కువ! అభివృద్ధి, ఆధునికతలంటూ మనం ప్రకృతికి దూరమైపోతూ నానాటికీ మరింతగా దిగజారిపోతున్నామని, మనసుకు ప్రశాంతత లేదని,ఒంటికి వ్యాయామం లేదని. నేటి మనం ఎదుర్కొంటున్న  సకల రుగ్మతలకూ ఇదే మూలమని. నేడు ఒంటికి వ్యాయామం ఎంత ముఖ్యమో మనసుకు శుద్ధీ అంతే ముఖ్యమని. ఏకకాలంలో ఈ రెంటినీ సాధించేందుకు ‘యోగా’ను మించిన ఔషధం లేదని ఆరోగ్యం అంటే మనందరం ఇదేదో శరీరానికి సంబంధించినదే అనుకుంటామని కానీ నిజమైన ఆరోగ్యానికి మూలాలు మనసులో ఉంటాయని మనసు నిర్మలంగా, నిశ్చలంగా ఉన్న చోట వ్యాధులకు ఆస్కారం చాలా తక్కువ. శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఉంటేనే మనం ‘సంపూర్ణ ఆరోగ్యం’తో ఉన్నట్టు. మనం రకరకాల వ్యాయామాలు చెయ్యొచ్చునని. పుష్టినిచ్చే ఆహారం తీసుకోవచ్చు.. మందులేసుకోవచ్చు. ఎన్ని చేసినా ఇవన్నీ కూడా శరీరాన్ని తప్పించి మన మనసును తాకలేవు. మనసును కూడా స్పృశించి.. శరీరాన్నీ, మనస్సునూ సమతౌల్యంలోకి తెచ్చే అమోఘ పనితనమని రెవిన్యూ డివిజన్ అధికారిణి భవాణి అన్నారు.జూన్ తొమ్మిది న బోయకొండ గంగమ్మ దేవస్థానం వద్ద ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా సుమారు వెయ్యి మందితో యోగా దినోత్సవం చేయుటకు ఏర్పాట్లు పరిశీలించారు.ఈ కార్యక్రమం లో మండలం పరిషత్ అభివృద్ధి అధికారిణి లీలా మాధవి,తాహాశిల్దార్ హనుమంతు, ఏ.పి.యం సుబ్రమణ్యం,సి.సి.లు సుగుణ,రమేష్ లు,ఉపాధి హామీ ఏ.పి.ఓ చిన్న రెడ్డెమ్మ,టి.ఎ లు ధనుంజయ, మహేష్ లు పాల్గొన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *