

గరుడ ప్రతినిధి : తిరుపతి జిల్లా, పాకాల మండలం, మొగరాల గ్రామం అనే ఒక మహా గ్రామం అని ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ వారంతా సంస్కృతి సాంప్రదాయాలకు విలువనిస్తూ, హిందూ ధర్మం పట్ల పట్టు కలిగిన వ్యక్తులు, ధర్మో రక్షతి రక్షితః అనే సిద్ధాంతాన్ని నమ్మిన అసాధారణ వ్యక్తులు కూడా చాలామంది ఈ గ్రామంలో ఉన్నారు. అసాధారణ వ్యక్తులు అని ఎందుకు అనవలసి వచ్చింది అంటే ఉరుకులు పరుగులతో సాగిపోయే ఈ రోజుల్లో కూడా భగవతారాధన భక్తి శ్రద్ధలు కలిగి, ఎదుటివారికి ఎటువంటి హాని కలుగకుండా మసలుకుంటూ, చీమకు సైతం హాని చేయకుండా, నీతిగా, నిజాయితీగా, సత్యాన్ని ఎంచుతూ బ్రతకడం చాలా కష్టం. అయినప్పటికీ మొగరాల గ్రామం ఎర్రేపల్లికి చెందిన శకుంతలమ్మ అనే ఈమె నిత్యం ద్రౌపతి అమ్మవారి దేవాలయంలో భగవత్సేవ చేసుకుంటూ, నిష్ఠగా ఉంటూ సాటి వారికి మంచి విషయాలు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో మహాభారతం అనే ఒక మహా యజ్ఞాన్ని మొగరాల గ్రామం ద్రౌపతి అమ్మ దేవాలయంలో నిర్వహిస్తున్న మొదటి రోజు నుండి ఉపవాసంతో ఉంటూ ఆహారం ఏమీ లేకుండా కేవలం మంచినీళ్లు తాగుతూ 18 రోజులపాటు 18 పర్వాలు మహాభారత యజ్ఞాన్ని, ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్న శకుంతలమ్మను పలువురు అభినందిస్తున్నారు. ఇటువంటి భక్తులు ఉంటే హిందూ ధర్మం పది కాలాలపాటు నిలిచే ఉంటుంది అనేది శకుంతలమ్మ నమ్మకం.


