గంగాపురం ప్రజల ఆదరాభిమానాలు ఎప్పటికీ మరువలేను – ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర

Sivaprasad Patro
Sivaprasad Patro - Staff reporter
1 Min Read

పార్వతీపురం మండలం గంగాపురం ప్రజలు తనపై చూపుతున్న ఆదరాభిమానాలు జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై మంజూరు చేసిన విత్తనాలను గురువారం ఆయన రైతులకు పంపిణీ చేశారు. అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం గ్రామస్తులనుద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను నియోజకవర్గ ఇన్చార్జిగా గ్రామానికి వచ్చినప్పుడు గంగాపురం ప్రజలు చూపిన ఆధరాభిమానాలు జీవితాంతం గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ఆ కృతజ్ఞతతోనే నియోజకవర్గంలో ఏ గ్రామానికి లేని విధంగా గంగాపురం గ్రామానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రోడ్లు కాలువ నిర్మాణం చెరువుల అభివృద్ధి ఇతర సంక్షేమ పథకాలలో గంగాపురం గ్రామానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు అలాగే తెలుగుదేశం పార్టీ రైతు పక్షపాతి అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గత వైసిపి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు నానా యాతన పడేవారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైతుల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖఅధికారులు, టిడిపి నాయకులు బోను చంద్రమౌళి, గురజాన చంద్రమౌళి, గొట్టాపు వెంకటనాయుడు, తానా తిరుపతి నాయుడు, రౌతు వేణుగోపాల్ నాయుడు, సింహాచల నాయుడు, టిడిపి జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *