
గరుడ న్యూస్,సాలూరు
ప్రకృతి పరిరక్షణ అనేది ఆక్సిజన్ పీల్చే ప్రతి ఒక్క మనిషి సామాజిక బాధ్యత.2025 థీమ్ బీట్ థ ప్లాస్టిక్ పొల్యూషన్.ప్లాస్టిక్ ను అరికట్టాలి అని అవగాహన కల్పించడం జరిగింది.సాలూరు వైటిసీ లో గ్రీన్ వరల్డ్ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ పాణిగ్రహి ఆద్వర్యం లో అవగాహన కల్పించడం జరిగింది.తదుపరి కర్రివలస కు చెందిన గ్రీన్ వరల్డ్ సభ్యులు త్యాడ జగన్నాథరావు కుమారుడు టీ.వెంకట మృత్యుంజయ రావు శ్రీదేవి దంపతులు మాతృమూర్తి కి. శే. త్యాడ కమలమ్మ జ్ఞాపకార్థం రొట్టెలు,పండ్లు,బిస్కెట్లు వైటీసీ లో గర్భిణులకు,సహాయకులకు అందించారు.

