
గరుడ (న్యూస్) పుంగనూరు ప్రవేటు బస్టాండ్ సమీపంలో వెలసియుండు మహిమన్విత శక్తి స్వరూపిణి వీరుపాక్షి మారెమ్మ ఆలయం లో శుక్రవారం సందర్బంగా అమ్మవారి కి అర్చకులు నవ దాన్యములతో ప్రత్యేక అలంకారం గావించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి రాహుకాల పూజలో మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
