బోయకొండలో రాహుకాల అభిషేకం- అన్నదానానికి విశేష స్పందన

G Venkatesh
1 Min Read

గరుడ ( న్యూస్ )ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం లో శుక్రవారం లోకసుభిక్షం కోరుతూ రాహుకాల అభిషేకాన్ని సాంప్రదాయ పద్దతిలో నిర్వహించారు. ఉదయాన్నే ప్రధాన అర్చకులు వేదపండితుల వేదమంత్రాలతో అమ్మవారికి ప్రత్యేకలంకరణ చేసి, విశిష్టాభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో భక్తులు , ఆలయ కార్మనిర్వాహణాధికారి,ఉపకమీషనర్ జే. ఏకాంబరం, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
అమ్మవారి ఆశిస్సులతో కోర్కెలు తీరిన భక్తులు ప్రతి శుక్రవారం అన్నదానం చేయడం ఆనవాయితీ గా వస్తుంది.ప్రతి వారము అమ్మవారి చే కోర్కెలు తీర్చబడిన భక్తులు దేవస్థానం ఆద్వర్యం లో అన్నదానం నిర్వహిస్తున్నారని,ఎవరైనా భక్తులు అన్నదానం చేయదలచిన వారు,విరాలాళ్ళు ఇవ్వదలచిన వాళ్ళు పరిపాలనా భవణం లో సంప్దదించవచ్చునని,ఇచ్చిన విరాలాళ్ళు కు తగిన రసీదును పొందాలని ఈ.ఓ ఏకాంబరం తెలియజేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *