

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటనకు సోమవారం రానున్న దృష్ట్యా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు కురుపాం శాసన సభ్యులు తోయక జగదీశ్వరి, జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్, పోలీస్ సూపరింటెండెంట్ ఎస్ వి మాధవ రెడ్డి, పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి మరియు పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఏఎస్పీ అంకిత సురాన ఏర్పాట్లను పరిశీలించారు. పార్వతీపురం పట్టణంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సత్కార కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడే కార్యక్రమాన్ని స్థానిక రాయల్ కన్వెన్షన్ లో ఏర్పాటు పట్ల వసతులు పరిశీలించారు.
