
గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లోను ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో బక్రీద్ వేడుకలను శనివారం నిర్వహించారు. మసీదుల్లోను, ఈద్గాల వద్ద నమాజ్లు నిర్వహించారు. పుంగనూరు పట్టణం, పరిసర ప్రాంతాలలోని వేలాది మంది ముస్లింలు నూతన దుస్తులు ధరించి, పట్ణణ సమీపంలోని ఎన్ఎస్.పేటలో గల ఈద్గా వద్ద, అలాగే తోపుమఠంలో మహమ్మదాలి నిర్మించిన ఈద్గా వద్ద ముస్లింలు అధిక సంఖ్యలో హాజరై ప్రార్థనలు నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా స్మశాన వాటికలకు వెళ్లి మృతి చెందిన కుటుంబ సభ్యులకు నివాళులర్పించారు. మహమ్మద్ప్రవక్త సూక్తులను మత పెద్దలు వివరించారు. ముస్లింలు అల్లాహ్గ..అక్భర్ అంటు ప్రార్థనలు చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా మసీదుల వద్ద , ఇండ్ల వద్ద పేదలకు నగదు, దుస్తులు, అన్నదానాలు నిర్వహించారు. హిందూముస్లింలందరు కలసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటు వింధు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ సీఐ సుబ్బరాయుడు, ఎస్ఐలు లోకేష్, కెవి.రమణ, పోలీస్ సిబ్బంది బందోబస్తు చేపట్టారు.

