మంత్రి నారా లోకేష్  జిల్లా పర్యటన  భద్రతా ఏర్పాటులను పరిశీలించిన జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్

Sivaprasad Patro
Sivaprasad Patro - Staff reporter
1 Min Read

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యలు నారా లోకేష్  జూన్ 09వ తారీఖున పార్వతీపురం మన్యం జిల్లా, పార్వతీపురం పట్టణంలోని రాయల్ కన్వెన్షన్ హాల్ నందు పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సత్కరించుటకు గాను ఏర్పాటు చేసిన “షైనింగ్ స్టార్స్ అవార్డు” కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడే కార్యక్రమానికి మరియు వెంకంపేట గ్రామం దగ్గర్లో గల మైదానంలో నిర్వహించు బహిరంగ సభకు రానున్న నేపధ్యంలో శనివారం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  గుమ్మిడి సంధ్యా రాణి, రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు కురుపాం శాసన సభ్యులు తోయక జగదీశ్వరి, పార్వతీపురం శాసన సభ్యులు బోనెల విజయ చంద్ర, జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్,ఐఏఎస్ తో కలిసి జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్  రాయల్ కన్వెన్షన్ హాల్ను, బహిరంగ సమావేశ సభాస్తలిని పరిశీలించారు.. తదుపరి జిల్లాకి మొట్టమొదట సారిగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యలు వస్తున్న నేపద్యంలో పెద్ద ఎత్తున జనాలు వస్తారు అనే ఆలోచనతో పటిష్ట భద్రత , ట్రాఫిక్ తదితర అంశాలలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగాప్రజలు లోపలకి వచ్చే/పోయే మార్గములు, VVIP/VIP వాహనాల పార్కింగ్ స్ధలములు వద్ద బందోబస్తు మరియు భద్రత ఏర్పాటులను సమీక్షించి అధికారులకు పలు సూచనలు తెలియచేసినారు .ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ  తో పాటుగా పార్వతీపురం సబ్ డివిజన్ అధికారి  అంకిత సురాన,ఐపిఎస్, పార్వతీపురం రూరల్ సర్కిల్ సిఐ గోవింద రావు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *