వెబ్ కౌన్సిలింగ్ వద్దు, మాన్యువల్ కౌన్సిలింగ్ ముద్దు

G Venkatesh
1 Min Read

గరుడ న్యూస్ పుంగనూరు డివిజన్ యుటిఎఫ్ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఎమ్మార్సీ ముందర సెకండరీ గ్రేడ్ టీచర్లకు వెబ్ కౌన్సిలింగ్ వద్దు, మాన్యువల్ కౌన్సిలింగ్, కావాలి అని నిరసనను తెలియజేయడం జరిగింది . ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా నాయకుడు వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ ను నిర్వహిస్తామని హామీ ఇచ్చి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలను ను జరపడానికి ప్రయత్నం చేయడం, ఎంఈఓ ల ఆధ్వర్యంలో ఎంఆర్సి ల దగ్గర హెల్ప్ డస్కులను ఏర్పాటు చేసి ఉపాధ్యాయులను బలవంతంగా వెబ్ ఆప్షన్స్ ను నమోదు చేయమని చెప్పడం విచారకరమని, వెబ్ కౌన్సిలింగ్ ద్వారా సాంకేతిక పరమైనటువంటి సమస్యలు తలెత్తడంతో, చాలామంది సీనియర్ ఉపాధ్యాయులకు సరైన ప్లేసులు లభించకపోవడం, భార్యాభర్తలకు సుదూర ప్రాంతాల పాఠశాలలు కేటాయించడం, ఇదివరకే జరిగిన ప్రధానోపాధ్యాయుల బదిలీల నుండి నేటి వరకు జరిగిన వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అనేక సమస్యలు తలెత్తడం జరిగింది. కనుక ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు నిర్వహించాలని కోరడమైనది. అలా చేయని పక్షంలో రేపు రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లా కేంద్రాల డీఈవో ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ సంఘం నాయకులు శంకర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రెడ్డప్ప, సుబ్రహ్మణ్యం రెడ్డి, జగన్నాథం రాజు, చంద్రశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి, మనోహర్ తదితరులు హాజరు కావడం జరిగింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *