గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూన్ 09
రైతన్నలకు వెన్నుదన్నుగా కూటమి ప్రభుత్వం ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పూల చంద్రమౌళి అన్నారు సోమవారం మండలంలోని పంచాయతీ కేంద్రం పెద్ద కొండా మరి వద్ద గల రైతు సేవ కేంద్రం ముందు రైతులకు విత్తనపు వేరుశెనక్కాయలు అందించారు ఈ సందర్భంగా పూల చంద్రమౌళి ప్రసంగిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు కూటమి ప్రభుత్వం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారని అన్నారు రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కుమార్ రెడ్డి సుభాను కేశవరెడ్డి గురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు