ప్రభుత్వ ఉత్తర్వులు ఖాతర్ చేయని గుజ్జు ఫ్యాక్టరీ లైసెన్స్ లను రద్దు చేయాలి కలెక్టరేట్ వద్ద మామిడి రైతుల సంక్షేమ సంఘం ధర్నా

G Venkatesh
1 Min Read

గరుడ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖాతర్ చేయని గుజ్జు ఫ్యాక్టరీ యాజమాన్యం లైసెన్స్ లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం చిత్తూర్ కలెక్టర్ కార్యాలయం వద్ద మామిడి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘ కన్వీనర్ లు డా.టి. జనార్దన్, ఎ.హరిబాబు చౌదరి లు మాట్లాడుతూ గుజ్జు ఫ్యాక్టరీ యాజమాన్యం రైతు లనే కాకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ తోతాపురిని క్రస్సిగ్ చేయకుండా కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు.జిల్లాలో ఇపుటికే 25 శాతం కాయ రాలిపోయినందున రైతులు తీవ్రంగా నష్ట పోయారని పేర్కొన్నారు.ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం రూపాయలు 4 సబ్సిడీ గా ఇస్తున్నా గుజ్జు యజమానులు రూపాయలు 8 ఇవ్వడానికి జాప్యం చేయడం దుర్మార్గం అన్నారు.. ప్రభుత్వ నిర్ణయం అమలు చేయని ప్రాసెసింగ్ యూనిట్ లపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.. ప్రభుత్వం నిర్ణయం కఠినంగా అమలు చేస్తాం. జాయింట్ కలెక్టర్ విద్యాధరి రైతులకు హామీ మామిడి రైతులకు ప్రభుత్వం నుండి పూర్తి స్థాయి సహకారం వుంటుందని,, వెంటనే గుజ్జు ఫ్యాక్టరీ లు ప్రారంభించేలా చర్యలు తీసికొంటామని జెసి విద్యాధరి మామిడి సంక్షేమ కమిటీ కి హామీ ఇచ్చారు.. దర్నా అనంతరం మామిడి రైతు లు జెసి కి వినతిపత్రం అందజేశారు. ప్రతి ఫ్యాక్టరీ బహిరంగా ధరను ప్రదర్శించాలని, రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయనీయ కుండా చర్యలు తీసుకొంటున్నామని, బయట రాష్ట్రం నుండీ కాయలు రాకుండా ఆపివేస్తామని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమం లో,, రైతు సంఘం నేతలు,కె. మునిరత్నం నాయుడు, ఎ. ఉమాపతి నాయుడు,కన్వీనర్ లు శంకర్,కె. నాగమోహన్ రెడ్డి,మోహన్ రెడ్డి,కె. హరిబాబు నాయుడు, భాగ్యనధరెడ్డి, రమేష్,కార్మికు నాయకులు, నాగరాజు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *