తిరుచానూరు, గరుడ న్యూస్ (ప్రతినిధి): హరికృష్ణ: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలలో మూడవరోజు భాగంగా సోమవారం సాయంత్రం పద్మసరోవరంలో శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య సేవలు నిర్వహించినారు. అనంతరం సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల 30 నిమిషాలు వరకు పద్మావతి అమ్మవారికి పాలు పెరుగు తేనె చందనము సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించారు. సోమవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఉత్సవమూర్తులను పద్మ పుష్కరణ వద్దకు వేంచేపు చేశారు. అనంతరం పద్మసరోవరంలో అమ్మవారి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తుల ను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్ ఆలయ సూపర్డెంట్ రమేష్ ప్రసాదం ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు చలపతి ఇన్చార్జి ఏవిఎస్ఓ శైలేంద్రబాబు అర్చకులు బాబు స్వామి తదితరులు పాల్గొన్నారు కటాకించారు.