తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం పార్వతీపురం పర్యటన విజయవంతం అయిందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన టిడిపి నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో ఏ నాయకుడికి లేని విధంగా మంత్రి లోకేష్ కు పార్వతీపురం ప్రజలు స్వాగతం పలికారని తెలియజేశారు. అలాగే షైనింగ్ స్టార్స్ కార్యక్రమం పార్వతీపురంలోనే మొదటిసారిగా జరగడం, అందులో మంత్రి లోకేష్ పాల్గొనడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. నారా లోకేష్ పర్యటనలో పార్వతీపురం నియోజకవర్గానికి అనేక వరాలు ఇచ్చారని వెల్లడించారు. మంత్రి లోకేష్ పర్యటనలో పాల్గొన్న టిడిపి నాయకులు, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోను తెలుగుదేశం శ్రేణులు అందరూ ఐకమత్యంగా సాగాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆకాంక్షించారు