



గరుడ న్యూస్ జర్నలిస్టుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని చిత్తూరు జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సలీం,పుంగనూరు నియోజకవర్గ అధ్యక్షుడు సతీష్ లు డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జర్నలిజం అనేది ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభం అని ప్రజాస్వామ్య ప్రక్రియలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, ప్రజాస్వామ్యానికి ఈ నాల్గవ స్తంభం లేకపోతే ప్రజల హక్కులు,పారదర్శకత మరియు సమాచారం యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుందని గుర్తు చేశారు.అలాంటి జర్నలిస్ట్ లకు సంబందించిన సమస్యలను ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయేందుకు నేడు జర్నలిస్ట్ లు అందరు కలసి డిమేండ్స్ డే పాటిస్తూ అన్ని మండలాల లో తహసీల్దార్ కార్యాలయం లో వినతి పత్రాలు అందజేయడం జరిగిందని అన్నారు. డిమేండ్స్ లో ముఖ్యంగా జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని,మీడియా కమిషన్,జర్నలిస్ట్ ల పెన్షన్,మీడియా అకాడమీ బలోపేతం చేయాలనీ, జర్నలిస్ట్ ల ఉద్యోగా భద్రత,జర్నలిస్ట్ ల ఆరోగ్య బీమా, జర్నలిస్ట్ పిల్లలకు ప్రవేటు స్కూల్లలో రాయితీ ని కల్పించాలని,జర్నలిస్టులందరికీ సకాలం లో అక్రిడేషన్లు మంజూరు చేయాలని కోరూతు పుంగనూరు తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు.కార్యక్రమం లో పుంగనూరు APWJF జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ గిరి శేఖర్,ఉపాధ్యక్షులు మహమ్మద్ సైఫుల్ల,లోకేష్,జగదీష్,జావీద్ గౌరవ అధ్యక్షులు జి.ఆర్. మురళి, ప్రధాన కార్యదర్శి హీదాయతుల్లా(అప్ప ),కోశాధికారి భాను ప్రకాష్,వర్కింగ్ ప్రసిడెంట్ మురళి,లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి, రెడ్డెప్ప, బాబు, మంజునాథ్, సతీష్,శామీర్, పురుషోత్తం, కార్తీక్, విజయ్, బాలకృష్ణ, ఇర్ఫాన్,జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.