
సాలూరు, జూన్ 11,గరుడ న్యూస్ ప్రతినిధి:నాగార్జున
బుధవారం నాడు సాలూరు బంగారమ్మ గుడిలో నవజీవన్ ట్రస్ట్ తిరుపతి వారి ఆర్థిక
సహాయంతో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో విజయనగరం పుష్పగిరి కంటి ఆసుపత్రి వారు ఉచిత క్యాంప్ నిర్వహించారు.
ఈ ఐ క్యాంప్ కి అధిక సంఖ్యలో పేషెంట్స్ పాల్గొన్నారు.
ఈ ఉచిత పరీక్షలకు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా తీసుకురావాలి.
ఆరోగ్య శ్రీ కార్డ్ ఉన్నవారికి ఉచితంగా శాస్త్ర చికిత్స చేస్తారు మరియు రానుపోను ఖర్చులు భోజనం వసతి మందులు ఉచితంగా ఇవ్వబడను అని తెలియజేసారు.
బంగారమ్మ గుడిలో కళ్ళు చెక్ చేయడం జరిగింది. ఈ ఐ క్యాంపు
121 పేషెంట్లు ఓపి లు వచ్చాయి అన్నారు. అలాగే కళ్ళు ఆపరేషన్ సెలెక్ట్ అయిన వారు 40 మంది విజయనగరం పుష్పగిరి కంటి ఆసుపత్రి సిబ్బందులు కళ్ళు చెక్ చేసిన వారు పి. నాగరాజు మార్కెటింగ్ మేనేజర్,పి.పావని ఆప్తమాలిక్ టెక్నీషియన్, దివ్యాంజలి ఆప్తమాలిక్ టెక్నీషియన్, అలాగే IRDS NGO ప్రెసిడెంట్ స్వాతి శ్రీ, ట్రెజరర్ చిక్కాల చిన్నమ్మలు మరియు నవజీవన్ సిబ్బందులు పాల్గొన్నారు
