ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి. ఎంపీపీ గాజుల రామ్మూర్తి

G Venkatesh
1 Min Read

గరుడ న్యూస్ చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండల సర్వసభ్య సమావేశం శాంతియుత వాతావరణం లో జరిగింది. ఈ కార్యక్రమం మండల పరిషత్ అధ్యక్షులు గాజుల రామ్మూర్తి, మండల పరిషత్ అభివృద్ది అధికారిణి లీలామాధవి ఆద్వర్యం లో శాంతియుతంగా జరిగినది.ఈ సందర్బముగా గాజుల రామ్మూర్తి మాట్లాడుతూ ఏవైనా పనులకు సంబందించి బిల్లులు పెంఢింగ్ లో ఉంటే వెంటనే చేయించుకోవాలని సర్పంచులు,యం.పి.టీసిలు దగ్గరుండి ప్రజలకు తెలియజేయాలని మంచినీటి కొరత లేకుండా చూడాలని,హౌసింగ్ కు సంబందించి ఏవైనా బిల్లులు పెండింగ్ ఉంటే వెంటనే చెల్లించాలని,అలాగే ఇంకనూ నిర్మాణాలు చేపట్టని ఇంటి వారితో చర్చించి త్వరితగతిన పూర్తిచేయాలని, గ్రామాలలో నీటి యద్దడి రాకుండా చూడాలని,రైతుభరోసా కేంద్రాల ద్వారా సరైన సమయం లో ఎరువులు,విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలని, పి.యం. కిషాన్ కోసం ఈకేవైసి సమస్య ఉన్న రైతులు సి.యస్.సి సెంటర్ల లో సమస్యను రెక్టిపై చేసుకోవాలని అన్నారు. టీకా కార్యక్రమం ప్రతి అంగన్ వాడి సెంటర్,పాఠశాలలో ఏర్పాటు చేశామని, అన్నారు.పాడి పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశామని అన్నారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్దీ హోల్డ్ భూముల పై సమగ్ర విచారణ జరుగు తుందని,మన మండలం లో దాదాపు గా ఆరువేల ఎకరాలు అసైన్మెంట్ నుండి సెటిల్మెంట్ అవుతుందని అన్నారు.ఈ కార్యక్రమం లో యం.పి.పి.మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం లో డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని,కావున ఇలాంటి వి పునరావృత్తం కాకుండా చూడాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమానికి మండల ఉపాధ్యక్షులు నరసింహ యాదవ్ సుధాకర్ రెడ్డి మండల అధికారులు,పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, యం.పి.టి.సి లు పాల్గొన్నారు.అంతే కాకుండా ఎవరైతే అధికారులు ఈ సర్వసభ్య సమావేశానికి హాజరు కాలేదు వారికి నోటీసులు పంపాలని సభ్యులు తీర్మానం చేశారు.అందుకు మండలం పరిషత్ అభివృద్ధి అధికారిణి లీలా మాధవి ఆమోదం కూడా తెలియజేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *