
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో కుప్పంలోని ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ఉద్దేశంతో అలీఫ్ సంస్థ యొక్క సహకారంతో రెండు విడుదలగా 100 మందికి పారిశ్రామిక వేత్తలుగా తయారు కావడానికి ట్రైనింగ్ నిర్వహించబడినది. ఈ ట్రైనింగ్ నందు అలిప్ సంస్థకు వారి పారిశ్రామిక వాడనందు ఉన్న అనేక పరిశ్రమల సందర్శనార్థం మరియు పరిశ్రమ స్థాపనకు అవసరమైన వివిధ రకాల సబ్సిడీలు బ్యాంకు గ్యారంటీలకు సంబంధించి ఎంపిక చేయబడిన 35 మంది కుప్పం నియోజకవర్గ మహిళలందరికీ కూడా ఈ నెల 13,14 రెండు రోజులు హైదరాబాదులోని ప్రగతి నగర్ నందుగల అలీఫ్ పారిశ్రామిక వాడ అలీఫ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ నందు శిక్షణ తరగతులు నిర్వహించడానికి ఏర్పాటు చేయడమైనది. దీనిని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం డాక్టర్ సురేష్ మరియు నాలుగు మండలాల అధ్యక్షులు శుభాభినందనలు తెలియడం జరిగింది. కడపిడి వికాస్ మరమ్మత్ గారు ఈ 35 మందికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు.

