
గరుడ న్యూస్ రామసముద్రం మండలంలోని అంగన్వాడి కేంద్రాల్లోని మూడు సంవత్సరాల పిల్లలకు గురువారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రం-3లో ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండేళ్లు పూర్తయి మూడో సంవత్సరం లో పడిన చిన్నారులకు అంగన్వాడి కేంద్రాల్లో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించినట్లు తెలిపారు. అన్ని అంగన్వాడి కేంద్రాల్లోనూ కార్యకర్తలు, ఆయాలు, తల్లిదండ్రుల సమక్షంలో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
