
గరుడ న్యూస్ పుంగనూరు పట్టణ సమీపంలోని నక్కబండలో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నక్కబండకు చెందిన షాహిదా (28) తన అవసరాల నిమిత్తం కొంత మంది వద్ద అప్పులు చేసినట్లు తెలిపారు. వారి వేదింపులు తాళలేక ఇంట్లో నిద్రమాత్రలు వేసుకుని అపస్మారక స్థితిలో పడి ఉండటంతో కుటుంబ సభ్యులు ఆమెను హుఠాహుఠిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సలు చేయించినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి , దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.
