పాఠశాలకు తాళం వేసిన తల్లిదండ్రులు

G Venkatesh
1 Min Read

గరుడ న్యూస్ పుంగనూరు మండలంలోని మార్లపల్లెలో గల ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థుల తల్లిదండ్రులు తాళం వేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు మండలంలోని మార్లపల్లెలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 1, 2 తరగతులు మాత్రమే అర్హత కల్పించి, పక్కగ్రామమైన సింగిరిగుంట ప్రభుత్వ పాఠశాలలో 3,4,5 తరగతులు నిర్వహించేందుకు అనుమతి మంజూరు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు సింగిరిగుంట పాఠశాలకు వెళ్లే మార్గంలో హంద్రీనీవా కాలువ , హైవే రోడ్డు ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలను మార్లపల్లె పాఠశాలలోనే చదువుకునేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయాలని కోరారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *