
గరుడ న్యూస్ పుంగనూరు పట్టణంలోని హైస్కూల్ వీధిలో గల జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యామిత్ర కిట్స్ పంపిణీ చేసినట్లు హెచ్ఎం రుద్రాణి తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఉన్నతశిఖరాలు చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్స్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
