
గరుడ న్యూస్ పుంగనూరు పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాలలో సామూహిక అక్షరాభ్యాసం చేయించినట్లు గురువారం ప్రాజెక్టు సూపర్వైజర్ అయేషానజ్రీన్తాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ పిలుస్తోంది అనే కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఉర్ధూస్కూల్, తూర్పువెహోగసాల, సుబేదారువీధి తదితర అంగన్వాడీ కేంద్రాల నందు అక్షరాభ్యాసం కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో చిన్నారుల తల్లిదండ్రులు హాజరై తమ పిల్లల వద్య అక్షరాభ్యాసం చేయించినట్లు తెలిపారు.
