
గరుడ న్యూస్. సమాజంలోని బాల కార్మికులను పనులను ఆపించి పాఠశాలల్లో చేర్పించాలని, పని వద్దు…బడి ముద్దు అనే నినాదాన్ని తీసికెళ్లి అవగాహన కల్పించాలని జూనియర్ సివిల్జడ్జి కృష్ణవంశీ సూచించారు. గురువారం కొత్తయిండ్లు మున్సిపల్ హైస్కూల్ నందు ప్రపంచ బాలకార్మికుల దినోత్సవాన్ని నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ చిన్నపిల్లలను పనులకు వినియోగించుకోవడం నేరమన్నారు. ఇటుకల బట్టిలు, హ్గటళ్ళు, పొలం పనులలో బాలలను వినియోగిస్తే జరిమానతో పాటు శిక్షార్హులని తెలిపారు. ప్రతి ఒక్కరు చిన్నపిల్లలను పాఠశాలలకు పంపి , విద్యాహక్కు గురించి చైతన్యపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఉషారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
