గరుడ న్యూస్ చౌడేపల్లి మండలం లోని చారగ్రామపంచాయతీ నందు సచివాలయం దగ్గర గల బోర్డుకు విద్యుత్ కనెక్షన్ ఎక్కడ నుండి ఇచ్చారు.సుమారు మూడు వందల మీటర్లు కేబుల్ లాగడం చేశారు.ఇన్ని రోజులు కేబుల్ వైరు చింత చెట్లు పై నుంచి వెళ్తుండేది.ప్రస్తుతం అక్కడ చింత చెట్లు మొత్తం నరికివేయడం జరిగినది.ఐతే అక్కడ విద్యుత్ వైరు నేలను తాకుతుంటే కూడా సరఫరా ఇచ్చారు. అక్కడ పశువులు కాపరులు,పిల్లలు ఎల్లప్పుడూ అదేదారిగుండా అటు రెడ్డికుంట ఆయకట్టు వెళ్తుంటారు. ఇప్పటికి విద్యుత్ అధికారులకు రెండుసార్లు పిర్యాదు కూడా చేశామని, విద్యుత్ అధికారులు వచ్చి సరఫరా తీసివేసి కొద్దిసేపట్లో తిరిగి ప్రైవేటు వ్యక్తులు సరఫరా ఇవ్వడం జరుగుతుంది.ఏదైనా ప్రాణాపాయం జరిగితే ఎవరు బాధ్యులు,ఏమి జరగకపోతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా సమస్య జరిగితే అప్పుడు తప్పు మొత్తం విద్యుత్ అధికారుల పై వస్తుంది.కాబట్టి వెంటనే సదరు కనెక్షన్లు పై విచారణ చేయాలి,నియమ నిబంధనల ప్రకారం విద్యుత్ కనెక్షన్లు మొదట దరఖాస్తు చేయాలి,తర్వాత అధికారులు వాటికి ఎస్టిమేషన్ వేయాలి,సినియారిటీ జాబితా లో ఉంచాలి,ఆ తర్వాత వాటికి సంబంధించిన మెటీరియల్ రావాలి,తర్వాత విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని నిబంధనలు ఉన్ననూ,కేబుల్ వైరు వేసే టప్పుడు ముప్పై మీటరు దాటిన యడల పోల్ ఖచ్చితంగా వేయాలనే నిబంధనలు ఉన్ననూ,అటువంటి నిబంధనలను ప్రక్కన పెట్టిన విద్యుత్ అధికారులు, విజిలెన్స్ అధికారులు సరిగా పట్టించుకోవడం లేదు.ఇక నైనా సంబంధిత అధికారులు వెంటనే సదరు కనెక్షన్లు పై విజిలెన్స్ విచారణ చేయాలని సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే ఐతే విజిలెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు.సదరు విద్యుత్ వైర్లను సీజ్ చేసి,కెసునమోదు చేస్తామన్నారు.