
గరుడ న్యూస్,సాలూరు రూరల్
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మరిపల్లి రైతు సేవా కేంద్రం పరిధి లో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సి. హెచ్. రంగారావు పరిధి లో పి ఎం డి ఎస్ విత్తనాలు రైతులు సామూహికంగా పొలాల్లో వేసుకోవటం జరిగింది. ఈ నవధాన్యాలు వేసుకుని 45 రోజులు తరువాత నేలలో కలియ దున్నటం వలన రక రకాల విత్తన వేరు వ్యవస్థ లో వివిధ రకాల సూక్ష్మ జీవులు వృద్ది చెందుతాయి అని ప్రధాన పంటకు కావలసిన నత్రజని, భాస్వరం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, బోరాన్, జింక్, ఐరన్, వంటి అన్ని రకాల పోషకాలను అందజేస్తాయని, అప్పుడు మొక్కలు తెగుళ్లు బారిన పడకుండా ఉంటాయని అందరు ప్రకృతి వ్యవసాయం చేసి భూసారం పెంచుకుని ఎటువంటి రసాయన ఎరువులు లేని పోషక విలువల గల ఆహార పదార్ధాలు తినటం వలన ప్రజల ఆరోగ్యం బాగుంటుందని,గట్లు పైన కూరగాయలు పండించడం వలన అదనపు ఆదాయం వస్తుందని, అందరూ పెరటి తోటలు వేసుకోవాలని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సలహా అందించడం జరిగింది . ఆ గ్రామంలో కొనిస గోపాల్ కూడా తన గ్రామంలో రైతులకు ప్రకృతి వ్యవసాయ సలహాలు సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సి హెచ్. రంగారావు,రైతులు పాల్గొన్నారు.

